తిరుమల ఎస్వీబీసీకి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ట్రస్ట్ (శ్రీ వెంటేశ్వర భక్తి ఛానల్)కు.. చెన్నైకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ ఛైర్మన్ అనురాగ్ వర్థమాన్ జైన్ దంపతులు రూ.2.1కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో ఆదివారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈ మేరకు వారు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్రెడ్డి పాల్గొన్నారు. లాక్డౌన్ తర్వాత వెంకన్న దర్శన భాగ్యం భక్తులకు కలిగిస్తున్నారు. జూన్ నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నారు.. టీటీడీ కూడా భౌతిక దూరం పాటించేలా చూస్తూ.. టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అలిపిరి దగ్గరే పరీక్షలు నిర్వహిస్తోంది.. భక్తుల్ని కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తోంది. అయితే లాక్డౌన్ తర్వాత వెంకన్నకు అందిన భారీ విరాళం ఇదే అని చెప్పాలి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3hCAYTH
Comments
Post a Comment