రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో టాట్ ఏస్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను స్వాధీ చేసుకుని పోస్ట్మార్ట్మ్ కోసం పంపించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా కర్ణాటకకు చెందిన కూలీలుగా గుర్తించారు. కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ ఉండటంతో.. టాటా ఏస్ వాహనంలో తమ సొంత ఊళ్లకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. లాక్డౌన్ దెబ్బకు హైదరాబాద్తో పాటూ చుట్టుపక్కల జిల్లాల్లో చాలామంది కూలీలు చిక్కుకుపోయారు. వీరంతా తమ సొంత ఊళ్లకు వెళ్లాలనే తొందరపాటులో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అనుమతించడం లేదు. ఎక్కడివారు అక్కడే ఉండాలని క్లియర్గా చెప్పింది. అయినా వినకుండా కొంతమంది కూలీలు ఇలా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. మరికొందరు కాలి నడకన సొంత ఊళ్లకు బయల్దేరారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3dzZyUd
Comments
Post a Comment