ఓవైపు కరోనా టెన్షన్.. మరోవైపు లాక్డౌన్ ఎఫెక్ట్ దేశంపై పడింది. ఇలాంటి విపత్కర సమయాల్లో.. ప్రజలకు, ప్రభుత్వాలకు భరోసా ఇస్తూ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. కరోనా నివారణకు తమవంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ విరాళాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తమకు తోచిన విధంగా సాయాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత సాయం ఒక్కటే కాదు.. తన పెద్ద మనసు చాటుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి క్లిష్ట సమయాల్లో మానవతా ధృక్పథంతో వ్యవహరించారు. జగన్ సర్కార్కు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయాల్లో వైసీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వానికి మరో విన్నపం చేశారు పవన్. మార్కెట్లు మూసివేశారని.. మామిడి రైతులు భారీ నష్టం వస్తుందనే భయంతో ఉన్నారని.. కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళపై ఉన్న ఒత్తిడిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని.. స్వయం సహాయక బృందాలకు సంబంధించిన లోన్ కట్టేందుకు జూన్ వరకు అవకాశం ఇవ్వాలని కోరారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3dwwmgF
Comments
Post a Comment