లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజలంతా కచ్చితంగా ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొంత సమయం కేటాయించారు. ఇక సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. నిబంధనలు అమలు చేస్తున్నా కొందరు ఆకతాయిలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. నాలుగు తగిలించి మరీ బుద్ది చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఎస్సై ఓవరాక్షన్ చేశారు.. లాక్డౌన్ వేళ జనాలపై విరుచుకుపడ్డారు. పద్దతిగా చెప్పాల్సింది పోయి రచ్చ చేశాడు.. విషయం సోషల్ మీడియాకు చేరడంతో ఏకంగా డీజీపీనే స్పందించారు. సదరు ఎస్సైను సస్పెండ్ చేశారు.పెరవలి మండలం ఖండవల్లికి చెందిన యువకుడు దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చాడు. అయితే అతడు ఐసోలేషన్ వార్డుకు వెళ్లకపోవడంతో పెరవలి ఎస్సై యువకుడి కుటుంబంపై రెచ్చిపోయాడు. యువకుడితో పాటు కుటుంబ సభ్యుల్ని దారుణంగా లాఠీతో కొట్టాడు. కొట్టొద్దని వేడుకున్నా వదల్లేదు.. దీంతో ఆ యువకుడు ఎస్సై తీరుపై మండిపడ్డాడు.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి లాఠీ విరిగేలా కొట్టాడు. యువకుడ్ని ఎస్సై కొట్టే సీన్ మొత్తాన్ని కొందరు స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేరుగా డీజీపీ దృష్టికి వెళ్లడంతో పెరవలి ఎస్సైను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా విదేశాల నుంచి వస్తే ఐసోలేషన్ సెంటర్కి పంపించాలి తప్ప.. దాడి చేయడం తప్పన్నారు డీజీపీ. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/33UShtF
Comments
Post a Comment