కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్..?

మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏది..? ఏ భారత సెలబ్రిటీని ఈ ప్రశ్న అడిగినా ముప్పావు శాతం మంది రెండు జట్ల పేర్లే చెప్తారు. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. టోర్నీలో ఆడిన ప్రతిసారి ప్లేఆఫ్‌కి చేరిన చెన్నై ఇప్పటి వరకూ మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఇక ముంబయి ఇండియన్స్ అయితే ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ని గెలిచింది. దీంతో.. ఎక్కువ మంది ఈ రెండ జట్ల పేర్లే చెప్తుంటారు. Read More: ఇటీవల భారత మహిళా జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్‌ని ‘‘మీకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభిస్తే..? ఏ జట్టుకి ఆడతారు..?’’ అని ప్రశ్నించగా.. ఆమె కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓటేసింది. కానీ.. ఉమెన్స్ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం తన ఫేవరెట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ టోర్నీలు రద్దవగా.. ఇంటి వద్దే ఉంటున్న క్రికెటర్లు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకి హర్మన్‌ప్రీత్ కౌర్ సమాధానమిచ్చింది. 2008 నుంచి ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగడం.. చతికిలపడటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పరిపాటిగా మారింది. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఉన్నప్పటికీ.. రెండు సీజన్లలో ఫైనల్ ఆడటం మినహా.. ఆ జట్టుది పేలవ ప్రదర్శనే. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందేహాలు నెలకొన్నాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3dybrKk

Comments