ఇంట్లో సిలిండర్ పేలుడు.. పక్కింట్లో వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని అమీర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. రెహమత్‌నగర్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటి పక్కన నివసించే వ్యక్తి మరణించారు. ఈయన ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. రెడ్‌హిల్స్‌ డివిజన్‌ జలమండలిలో ఈయన జీఎంగా పని చేస్తున్నారు. పక్కింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అప్రమత్తమైన ఆర్‌.శ్రీనివాసరావు(51) ఇంటి పక్కన కరెంటు స్విచ్‌లను ఆపేందుకు కిందకు వచ్చారు. దీంతో మళ్లీ పేలుడు సంభవించడంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడని సహోద్యోగులు తెలిపారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, కార్పొరేటర్‌ శేషుకుమారి, జలమండలి జీఎం ప్రభు తదితరులు శ్రీనవాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. Must Read: పక్కింట్లో సిలిండర్ పేలిన నేపథ్యంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. గ్యాస్ లీకై సిలిండర్ పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషించారు. Must Read:


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2xoIdNx

Comments